పెమ్మసాని వంశ మూలపురుషుడు తిమ్మనాయని తరువాత మరో ప్రసిద్ధ వ్యక్తి పెమ్మసాని రామలింగ నాయకుడు లేదా పెమ్మసాని రామలింగ నృపాలుడు. ఈ రామలింగ నాయకుడికి పెమ్మసాని పెద్ద తిమ్మనాయుడు అనే సోదరుడు కూడా ఉన్నట్లు చాటువుల్లో తెలుస్తుంది. వీరిరువురు సాళువ వంశస్థులు అయినా వీర నరసింహ రాయలు, శ్రీ కృష్ణ దేవరాయలు వారి వద్ద సామంతులు గా ఉన్నారు. పెమ్మసాని వారి సోదరి "పెమ్మసాని నాగలాంబ" ని సాళువ వీరనరసింహ రాయలుకి ఇచ్చి వివాహం చేసినట్లు వారి కుమారుడే శ్రీ కృష్ణ దేవరాయలు అని ప్రముఖ చరిత్ర పరిశోధకు లు "ముత్తేవి రవీంద్రనాధ్" గారు తమ పరిశోధాత్మక పుస్తకం అయినా "శ్రీకృష్ణ దేవరాయలు వంశ మూలాలు" అనే పుస్తం లో రాసుకొచ్చారు.
కారణాలు ఏవైనా సాళువ రాయల పాలనా లో పెమ్మసాని వారి ఖ్యాతి, కీర్తి మరింత ఇనుమడించింది. గండికోట సీమ పాలకులు గానే గాక శ్రీకృష్ణ దేవరాయలు పాలనా లో వారి సర్వ సైన్యాధక్షుడిగా పెమ్మసాని రామలింగ నృపాలుడు ఉండేవాడు అని అతని కింద దాదాపు 80 వేల మంది సైనికులు ఉండేవారని కైఫీయతు లలో ఉంది. ఆ కాలం లో కల్బర్గ్ రాజధాని గా మహమ్మద్ యేదుల్ ఖాన్ పాలించేవాడు. రాయలు కల్బర్గ మీద దండయాత్ర కి వెళ్ళినప్పుడు వారికీ సహాయంగా గోల్కొండ నవాబ్ కూడా యేదుల్ ఖాన్ కి మద్దతు గా రావడం తో యుద్ధం భయంకరంగా సాగింది. అలాంటి క్లిష్ట సమయం లో పెమ్మసాని రామలింగ నాయకుడు సింగపు బిల్లవలె యుద్ధరంగం లో పది వేల సేన తో దూకి రాయలు కి అండగా నిలబడి యుద్ధం లో తురక సేన లో చొరబడి వారి డేరీజు త్రాళ్లు తెగగోసి అనేక మందిని సంహరించి రాయలుకి విజయం కి చేకూర్చి పెట్టాడు. అప్పుడు రాయలు మిక్కిలి కొనియాడి అనేక బహుమానాలు ఇచ్చారు. ఈ యుద్ధ ఘట్టం గురించి "శ్రీకృష్ణరాయ విజయం" అనే గ్రంధం లో ఇలా వర్ణింపబడి ఉంది
"విని యా భూవరా కోటిలోన ఘన ధో - ర్వీర్య ప్రతాపండు బం
ధు నృపాలా ప్రభాలుండు యుద్ధముల యం- దుం స్వామి కార్యంబులం
దున యఘ్నుoడగు పెమ్మసాని కుల చం - ద్రుoడైన యా రామలిం
గా నృపాలాగ్రణి వల్కె సంగర కళా -కౌతుహా లయత్తుడై
పెమ్మసాని రామలింగ నృపాలుని యుద్ధరంగా పరాక్రమం ని గూర్చి
"అనుచుo బల్లెం గెలభూనుకొని శౌ - ర్యరూఢులై కమ్మవా
ర్వేనువేటం బదివేలు బల్లెముల తో - విఖ్యాత శౌర్యాన్నితం
జనుదేరం ఘన సింహారావ మలరం - ధంసైన్యంజొచ్చి హై
చ్చిన దైర్యంబున బారసీకా తతులం - జెండాదే నుద్దంఢుడై "
ఇలాగె యుద్ధం లో పది వేల మంది కమ్మ యోధుల సహాయం తో ఈ శూరశిఖామణి అద్భుత పరాక్రమం చూపి తురక సైనికుల్ని పారద్రోలి వజీర్లని హతమార్చాడు. రామలింగ నాయకుడు తన పేరు తో తాడిపత్రి లో ప్రసిద్ధ రామలింగేశ్వర దేవాలయం కట్టించాడు. తాడిపర్రు బస్తి ని కట్టించి అభివృద్ధి చేసారు. ఈయన తన పేరు తో రామలింగనాయని పల్లె కూడా నిర్మించారు. యర్రమల కొండా బుగ్గ వద్ద ఓబులేశ్వరాలయం కూడా కట్టించి ఇచ్చారు.
రామలింగ నాయునికి ఇద్దరు కుమార్తెలు ఒకరు రాజగోపాలమ్మ మరొకరు గోవిందమ్మ. ఈ గోవిందమ్మ ని ప్రకాశం జిల్లా ధూపాటి సీమ నేలే "శాయపనేని" వంశస్థులకి ఇచ్చి చేసినట్లు ఆవిడ కూడా మహా యోధురాలు అని తెలియుచున్నది.
పెమ్మసాని రామలింగ నాయుని తరువాత మరో యోధుడు పెమ్మసాని పెద్ద తిమ్మానాయుడు. ఈయన కూడా మహాయోధుడు అని ఒక బాణపు వేటు తో గుర్రపు డొక్కా తేల్చి వేయగల శూరుడు అని ప్రతీతి. ఇలా 1431 నుండి 1652 వరకు దాదాపు 250 ఏళ్ళు గండికోట సీమ ని పెమ్మసాని వంశీయులే పరిపాలించారు. 1652 వ సంవత్సరం ఆగష్టు 25 నా పెమ్మసాని చిన్న తిమ్మనృపాలుడు హయం లో గోల్కొండ నవాబుల పాలెగాడు మీర్ జమ్లా కుట్ర తో ధనం ఆశచూపి గండికోట మంత్రి అయినా "పొదిలి లింగన్న" అనే బ్రాహ్మణుడిని లొంగదీసుకుని పెమ్మసాని తిమ్మ నృపాలుడికి విష ప్రయోగం జరిపించి హత్య చేయించి గండికోట ని వశపర్చుకున్నాడు. ఆలా తెలుగు నాట మిగిలిన ఒకే ఒక్క హిందూ సామ్రాజ్యం కూడా మహమ్మదీయుల దండయాత్ర లో అంతరించి పోయింది
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి