10, ఏప్రిల్ 2021, శనివారం

ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారి 100వ జయంతి సందర్భంగా వారి ని స్మరించుకుంటూ నా అక్షర నివాళులు

 


ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, దార్శనికుడు, గొప్ప దాత. గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక వెలుగులు నింపి వేలాది మంది యువతకు ఉపాధి బాట చూపిన మహామనీషి. తూర్పు గోదావరి జిల్లా, కపిలేశ్వరపురము మండలం పెదపట్నం లో 1921, జూలై 28 న చిట్టూరి జమీందారీ వంశములో, ముళ్ళపూడి తిమ్మరాజు, వెంకటరమణమ్మ దంపతులకు జన్మించాడు.  తెలుగు నాట మొదటి తరం పారిశ్రామిక వేత్త లు గా పేరెన్నికగన్న  KCP గ్రూప్ వెలగపూడి రామ కృష్ణ గారు, ఆంధ్ర బిర్లా గా పిలవబడే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ గారు,  శ్రీరామ్ దాస్ మోటార్స్  కంటిపూడి చౌదరి గారు ప్రముఖులు. 

పాఠశాల విద్య (ఎస్ ఎస్ యల్ సి) పూర్తి చేసిన హరిశ్చంద్ర ప్రసాద గారు దేశానికి స్వాతంత్ర్యము రావడానికి నాలుగు రోజుల ముందు (ఆగస్ట్ 11, 1947) తణుకు లో ఆంధ్రా సుగర్స్ స్థాపించారు, అంచలంచెలుగా విస్తరింపబడిన ఈ పరిశ్రమ ఒరవడి కాస్టిక్ సోడా, కాస్టిక్ పొటాష్, క్లోరీన్, హైడ్రోజెన్, సల్ఫ్యూరిక్ ఆమ్లము, సూపర్ ఫాస్ఫేట్, రాకెట్ ఇంధనము మొదలగు ఉత్పత్తులకు దారి తీసింది. గుంటూరులో నూనెలు, హైడ్రాజినేటెడ్ నూనెలు తయారీ. #తాడువాయి_భీమడోలు_కొవ్వూరు_సగ్గొండ లలో వివిధ #కర్మాగారాలు.

ఉమ్మడి ఆంధ్ర లో  పారిశ్రామిక రంగానికి ఆద్యుడు.

గ్రామీణ ప్రాంతములో, విద్యుత్ లేని కాలములో జనరేటర్ సాయముతో స్థాపించబడిన పరిశ్రమ.

గత 74 సంవత్సరాల కాలంలో ఆంధ్రా సుగర్స్ లో ఒక్క రోజు కూడ సమ్మె జరగలేదు.

12,000 ఉద్యోగులు.

1947లో రోజుకి 600 టన్నుల చెరకు ఒత్తబడి తో మొదలయ్యి ప్రస్తుతము 10,000 టన్నులు చేరింది.

రాష్ట్ర ప్రభుత్వమునకు అత్యధిక పన్ను చెల్లించు పరిశ్రమ.

దేశ రాకెట్ ప్రయోగాలకు అవసరమగు ఇంధనము తయారు చేయు ఏకైక సంస్థ.

ప్రపంచములో రాకెట్ ఇంధనము తయారు చేయు 5 దేశములలో భారత దేశాన్ని చేర్చిన ఘనత.

భారత దేశములో యాస్పిరిన్ తయారు చేసిన తొలి కర్మాగారము.

మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర షుగర్స్ సముదాయము

ఎక్సిక్యూటివ్ డైరెక్టర్, ఆంధ్రా పెట్రో కెమికల్స్, విశాఖపట్నం.

మానేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర కెమికల్స్ కార్పొరేషన్

హిందూస్తాన్ ఎలైడ్ కెమికల్స్

డైరెక్టర్, ఎమ్ ఎ ఎలికాన్ ఇంజినీరింగ్ కంపెనీ, వల్లభనగర్, గుజరాత్

డైరెక్టర్, ఆంధ్రా ఫౌండ్రీ మరియు మెషీన్స్, హైదరాబాదు

ఛైర్మన్, జోసిల్ లిమిటెడ్, డోకిపర్రు.

ఛైర్మన్, సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్, వెంకటరాయపురం.

జయలక్ష్మీ ఫెర్టిలైజర్స్, వెంకటరాయపురం.

ఛైర్మన్, శ్రీ అక్కమాంబ టెక్స్ టైల్స్ లిమిటెడ్, వెంకటరాయపురం.

ఆంధ్రా ఫారం కెమికల్స్ కార్పొరెషన్ లిమిటెడ్, కొవ్వూరు.

కృషి, పట్టుదల, దీక్ష.. ఈ మూడు కలిస్తే ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌. తిమ్మరాజు, వెంకటరమణమ్మ దంపతులకు తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెదపట్నం గ్రామంలో జన్మించిన ఆయన తణుకులో ఫోర్త్‌ ఫోరం వరకూ చదివారు. 24 ఏళ్ల వయసులో 1947 ఆగస్టులో తణుకులో ఆంధ్రా షుగర్స్‌ పరిశ్రమను స్థాపించారు. అప్పట్లో జనసంచారంలేని ఆ ప్రాంతాన్ని పరిశ్రమ స్థాపనకు ఎన్నుకోవడం ఒక సాహసం. మొదట్లో రోజుకు 600 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో స్థాపించిన కర్మాగారం అంచెలంచెలుగా ఎదిగి 6 వేల టన్నులకు చేరేలా కృషి చేశారు. ప్రారంభంలో 350 మందితో ప్రారంభించిన ఆంధ్రా షుగర్స్‌ నేడు వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి పథంలో మరింతగా సాగుతోంది. ఆ తర్వాత కాస్టిక్‌ సోడా, కాస్టిక్‌ పొటాష్‌, క్లోరిన్‌, హైడ్రోజన్‌ తయారీ ప్లాంటును 1960లో స్థాపించారు. సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌, సూపర్‌ ఫాస్ఫేట్‌ ప్లాంటులను 1960లో స్థాపించారు. 1984లో తణుకులోనే ర్యాకెట్‌ ఇంధన ప్లాంటును అప్పటి ఉప రాష్ట్రపతి శంకర్‌ దయాల్‌ శర్మ చేతుల మీదుగా ప్రారంభింప చేసి పారిశ్రామిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లారు. గుంటూరులో ఆయన నూనె గింజలు, బియ్యం, తవుడు ముడిపదార్థాలుగా తయారు చేసే నూనెలు, హైడ్రోజనేట్‌ అయిల్స్‌ తయారుచేసే ప్లాంట్లను ఏర్పాటు చేశారు. 1995 ,96 సంవత్సరాల్లో టాటా లని బిర్లాలని అంబానీలని మించి  దేశం లోనే  highest  payer  గా నిలిచారు.    ఆంధ్రా బిర్లాగా ప్రఖ్యాతి చెందిన డాక్టర్‌ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ పల్లెటూరి రైతువారీ పెద్దమనిషిగా, సాదాసీదాగా కనిపిస్తారు. 24 ఏళ్ల వయసులో ఆంధ్రాషుగర్స్‌ స్థాపించినప్పుడు ఆయన ఎంత ఉత్సాహంగా ఉండేవారో 91 ఏళ్ల వృద్ధాప్యంలోనూ అంతే ఆసక్తితో పని చేస్తూ వచ్చారు. హరిశ్చంద్రప్రసాద్‌ ఏక సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య సంఘాలల్లో సభ్యులుగా కొనసాగుతూనే ఉన్నారు.


పారిశ్రామిక దిగ్గజంగా పేరుగాంచిన ముళ్లపూడి రాజకీయాల్లోనూ సేవలందించారు. మొదట్లో కాంగ్రెస్‌వాదిగా పేరొందిన ఆయన ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఉండగానే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అనంతరం 1955-67లో మధ్య రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తణుకు గ్రామ పంచాయతీ సర్పంచిగా పనిచేసిన ఆయన 1981లో తణుకు మున్సిపాల్టీగా ఏర్పడిన తర్వాత తొలి మున్సిపల్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతర కాలంలో ఆయన తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.

ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్‌ గారు కేవలం పారిశ్రామిక రంగానికే పరిమితం కాలేదు. తణుకులో ఆయన వివిధ సేవాకార్యక్రమాలు చేపట్టారు. పాలిటెక్నిక్‌ కళాశాల, ట్రస్ట్‌ ఆసుపత్రి, ముళ్లపూడి తిమ్మరాజు మెమోరియల్‌ లైబ్రరీ స్థాపించారు. రంగరాయ వైద్య కళాశాల ఏర్పాటులో ఆయన కృషి ప్రశంసనీయం. ధార్మికరంగంలో విజయవాడ తపోవనం, జూబ్లీహిల్స్‌లో శ్రీసీతారామస్వామి ధ్యాన మందిరం, భద్రాచలంలో సీతారామస్వామి దేవస్థానం, నరసాపురంలోని హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, విశాఖపట్నం ప్రేమ సమాజం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అధ్యక్షునిగా, పాలకమండలి సభ్యునిగా పనిచేసి ఆ సంస్థల ద్వారా పలు ధార్మిక కార్యక్రమాలు చేపట్టారు. తణుకు వెంకట్రాయపురంలో ముళ్లపూడి వెంకటరమణమ్మ స్మారక ఆసుపత్రి, కంటి ఆసుపత్రిని నిర్మించి ఎందరో పేదలకు వైద్య సేవలందిస్తున్నారు.

తణుకు గ్రామ పంచాయతీ సర్పంచ్

తణుకు మునిసిపల్ ఛైర్మన్

ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యుడు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ్యుడు

అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ఫ్యాప్సీ.

ఛైర్మన్, నబార్డ్ అగ్రి బిజినెస్

ఉత్తమ యాజమాన్య అవార్డ్ - 1973.

చక్కెర కళాప్రపూర్ణ, అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రము - 1981.

ఉత్తమ సాంకేతిక అభివృద్ధి అవార్డ్ - 1985.

ఇంధన పొదుపులో జాతీయ అవార్డ్ - 1991.

ఉత్తమ మార్కెటింగ్ కంపెనీ అవార్డ్ - 1992.

ప్రశంసా పత్రము, ఇస్రో

వృక్షమిత్ర పురస్కారము

హైదరాబాదు మేనేజ్ మెంట్ అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారము

నాగార్జున విశ్వవిద్యాలయము గౌరవ డాక్టరేట్.

ముళ్ళపూడి తిమ్మరాజు స్మారక గ్రంథాలయము

విజయవాడ తపోవనం.

శ్రీ సీతారామస్వామి ధ్యాన మందిరం, జూబిలీ హిల్స్

హిందూ స్త్రీ పునర్వివాహ సహాయక సంఘం, నరసాపూర్

ప్రేమ సమాజం, విశాఖపట్నం.

ముళ్ళపూడి వెంకటరమణమ్మ స్మారక వైద్యశాల, తణుకు.

కంటి వైద్యశాల, తణుకు

రంగరాయ వైద్య కళాశాల, కాకినాడ.

ఇలాంటి ఘన కీర్తి ఉన్న గొప్ప వారిని స్మరించడం మన అదృష్టం...!!

8, ఏప్రిల్ 2021, గురువారం

70 వ దశకం నుండి 1983 వరకూ తెలుగు మీడియా - రాజకీయ ప్రభావం - కారణాలు, నిజాలు

 పచ్చ మీడియా అనే ఒక పదం ఈ మధ్య ఒక రెండు దశాబ్దాల కాలం లో తెలుగు రాష్ట్రాల్లో  వాడబడుతున్న ఒక పదం. దీని పూర్వాపరాల లోకి వెళ్లి చూస్తే..అసలు ఆంగ్లం  లో ఈ పదాన్ని ఎవరికోసం ఉద్దేశించి కనిపెట్టారో వాళ్ళే దీన్ని వాడటం ఇక్కడ మహా వెటకారం.

చంద్రబాబు గారు  గోబెల్స్ అని, పచ్చ మీడియా ద్వారా రెండు రాష్ట్రాలను కంట్రోల్ చేసేస్తున్నాడు అని మొదలు పెట్టిన్న ఈ ప్రచారం ఇప్పుడు శ్రుతి మించి వెర్రి తలలు వేస్తుంది.నిజానిజాలు చెప్పే ఓపిక తెలిసిన వారికి లేక.. తెల్సుకునే తీరిక  ఇప్పటి జనం కి లేక జనాలు ఈ వారు విసిరినా మూఢత్వం లో కొట్టుకుపోతున్నారు. 

అసలు తెలుగుదేశం పుట్టే నాటికి వున్న ప్రధాన పత్రికలు తీసుకుంటే ఈనాడు, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, విశాలాంధ్ర, ప్రజా శక్తి ప్రధాన మైన్ స్ట్రీమ్ పత్రికలు.  పైన చెప్పిన దిన పత్రికల్లో అప్పటికే ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి కాంగ్రెస్ ఏంపి లవి అందులో ఒకటి తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డి ధీ. ఆంధ్ర ప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ రామనాథ గోయెంక ది. ఆంధ్ర పత్రిక కాశీనాథుని నాగేశ్వరావు గారిది, ఆయన చనిపోయాక ఆయన అల్లుడు, కాంగ్రెస్ ఎంపీ  శివలెంక శంబు ప్రసాద్ ఆయన తర్వాత ఆయన వారసులు నడిపారు. సో ..అరవై లకే అప్పటి హై యస్ట్ సర్క్యులేట్ డ్ ఆంధ్ర పత్రిక కాంగ్రెస్ వారిది. ఈ ప్రధాన పత్రికలు కాక ఇంకో డజన్ చిన్న చితక దిన పత్రికలు గా చెప్ప బడేవి వుండేవి

సితార, జ్యోతి చిత్ర ప్రధాన సినిమా పత్రికలు. సితార ఈనాడు ది అయితే, జ్యోతి చిత్ర ఆంధ్ర జ్యోతి ది. జ్యోతి చిత్ర టాప్ సినిమా పత్రిక. ఆంధ్ర జ్యోతి కి బాల జ్యోతి అనే పిల్లల పత్రిక కూడా వుండేది. బాగా నడిచేది. ఇవి కాక వీక్లీ ల హవా నడుస్తున్న ఆ కాలం లో  ఆంధ్ర జ్యోతి, ప్రభ, పత్రిక, భూమి కి వీక్లీ మాగజిన్ లు అదనం గా వుండేవి. 

ఈనాడు వచ్చేనాటికి ఆంధ్ర ప్రభ ఎంట్రీ తో మద్రాస్ ప్రధాన కేంద్రం గా పబ్లిష్ అయే ఆంధ్ర పత్రిక దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితి . అప్పటికే కాంగ్రెస్ భజన పత్రికలను జనాలు ఆదరించడం తగ్గిపోయింది అనే దానికి ఆంధ్ర ప్రభ లభించిన ఆదరణే సాక్షం. తర్వాత  ఈనాడు ఎంట్రీ తో అప్పటి వరకు మూస లో సాగుతున్న దిన పత్రిక పద్దత్తు ల్లో పెను మార్పులు రావడం వల్ల ప్రజలు విపరీతం గా ఆదరించారు. 1974 కి 20 వేల ముద్రణ కెపాసిటీ తో మొదలు అయ్యిన ఈనాడు ప్రస్థానం 1979 కి ఒక లక్షా ఏనబై  వేల కి చేరింది. తెలంగాణ ఉద్యమం , విశాఖ ఉక్కు, జై ఆంధ్ర ఉద్యమాలు, ఎమర్జెన్సీ అనంతరం ప్రజల్లో పెరిగిన రాజకీయ చైతన్యం కూడా తెలుగునాట పత్రికా  పఠనం పట్ల జనం లో ఆసక్తి ని పెంచటం లో దోహద పడింది.  ఆంధ్ర ప్రదేశ్ లో అక్షరాస్యత శాతం లో పెరుగుదల కేవలం 6 శాతం మాత్రమే నమోదు అయ్యిన ఈ కాలం లో దిన పత్రికల పాఠకుల సంఖ్య 70 శాతం పెరిగింది. సింపుల్ గా చెప్పాలి అంటే, రొటీన్ రొట్ట కొట్టుడు తరహా నుంచి నవలా ప్రపంచం లో  ఒక యండమూరి కలిగించిన విముక్తి లాంటి దే ఈనాడు క్రియేట్ చేసింది కూడా. 

ఇలాంటి సమయంలో ప్రతి ఐదు ఏళ్ళకి సర్క్యులేషన్ రెట్టింపు అవుతూ, వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేసుకుంటున్న ఏ ఒత్సాహిక వ్యాపార వేత్త కూడా కుల పిచ్చి తో నో మరొక పిచ్చి తో నో అప్పుడే పుట్టిన తెలుగుదేశం కి అండ గా నిలబడే వెర్రి సాహసం చేయడు. పైగా కేంద్రం లో కక్షపూరిత మనస్త్వత్వం గల  ఇందిర గాంధీ  సంగతి, కాంగ్రెస్ సంగతి తెలిసి కూడా. కానీ రామోజీ కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్  తీసుకున్నాడు అంటే జనం లో వున్న కాంగ్రెస్ వ్యతిరేకత కు భిన్నంగా వెళ్లి  వ్యక్తిగత ఇమేజ్ క్రెడి బిలిటీ దెబ్బ  తీసుకుంటే  వ్యాపారం కూడా దెబ్బ అవుతుంది అని లెక్క వుంది కాబట్టే రామోజీ అప్పటి ప్రజా నిర్ణయం బట్టి కాంగ్రెస్ ని వ్యతిరేకించాడు అనేది స్పష్టం. (తర్వాత కాలం లో కూడా జనం లో ఆదరణ వస్తుంది అనుకున్న ప్రతి సారి NTR గారి మీద కూడా  ఏడా పెడ కార్టూన్ లు కామెడీ లు వదిలిన చరిత్ర ఈనాడు కి వుంది, ఆ విషయం ముందు ముందు మాట్లాడుకుందాం) 

1983 చివరికి వచ్చేసరికి ఈనాడు పాఠకులు రెట్టింపు అయ్యారు , 1979 లో లక్షా ఏనాబై వేలు నుంచి 3 లక్షల 47 వెలు అయ్యింది. అలాగే మిగతా కొన్ని పత్రికలు కూడా కాంగ్రెస్ ఎంపి కేఎల్ ఏన్ ప్రసాద్ గారి ఆంధ్ర జ్యోతి సర్క్యులేషన్ 25 వేల నుండి 67 వెలు కి పెరిగింది 1983 కి . తిక్కవరపు చంద్ర శేఖర్ రెడ్డి నడిపే   ఆంధ్ర భూమి లాంటి పరమ కాంగ్రెస్ భక్తి పత్రిక ల ను మాత్రం ఎంతో అభిమానం ప్రేమ తో గజ్జెల మల్లారెడ్డి లాంటి వాళ్ళు వెళ్లి మరీ కృషి చేసినా  కూడా సర్క్యులేషన్ డ్రాప్ ని ఆపలేక పోయారు. 

ఇవి కాక ఇహ మిగిలింది విశాలాంధ్ర, ప్రజాశక్తి..ఇవి రెండు తెలుగు దేశం పార్టీ తో 1983 ఎలక్షన్ ల లో ప్రత్యర్థులు గా పోటీ చేసిన కమ్యునిస్ట్ పార్టీ లవి. సో.. తెలుగుదేశం కి అవి సపోర్ట్ చేసే పరిస్తితి లేదు. అలా అడ్డం గా ఒక పార్టీ ని సపోర్ట్ చేసినా వ్యతిరేకించినా ఆ పత్రికలు పెద్దగా నిలబడని కాలం అది. ఏక పక్షంగా కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి తో పోయిన గోయెంక ఆంధ్ర ప్రభ ని కూడా జనం ఆదరించడం మానేస్తున్న ఆ టైమ్ లో..కొంత వరకూ న్యూట్రల్ గా ఉండటానికి ప్రయత్నం చేసిన ఆంధ్ర జ్యోతి కి కాంగ్రెస్ ఎంపి పత్రిక అయ్యినా ఆదరణ లభించింది.( ఆ తర్వాత కాలం లో ఆ ధోరణి కి దూరం జరిగాక ఆంధ్ర జ్యోతి కనుమరుగు అయ్యింది).

ఇప్పుడు ఇక్కడ చూస్తే 1982-83 తెలుగు దేశ ప్రభంజనం లో తెలుగుదేశం కి పరోక్షం గా సహకరించింది ఒక పత్రిక అనుకుంటే..కాంగ్రెస్ కి డైరెక్ట్ గా సహకారం అందించినవి ఎన్నో చూస్తే వాస్తవం అర్దం అవుతుంది. 

 ఆ రోజుల్లో డైరెక్ట్ గా కాంగ్రెస్ ఏంపి లు నడుపుతున్న పత్రికలు, ఇన్ డైరెక్ట్ గా ఆ పత్రిక లను అడ్డు పెట్టుకొని చిన్నా చితకా ముద్రాలయలను, జర్నలిస్ట్ లను రచయతలను ఎలా లోబర్చుకొని రాశారో,రాయించారో కొంచం వెనక్కి వెళ్లి చూడక్క ర్లేదు..ఇప్పుడు నడుస్తున్న చరిత్ర సాక్షి గా చూస్తే అర్ధం అవుతుంది. 

ఇక్కడ పచ్చ పత్రిక"లు" అనడానికి, "లు* కూడా లేవు,కాస్తో కూస్తో అండగా వున్నది ఒకటే పత్రిక, అలా వుండటానికి  దాని కారణాలు దానికి వున్నాయి.  అవి వదిలి పచ్చ పత్రికలు పచ్చ పత్రికలు అంటూ పదే పదే పాడి జనం నీ   వెర్రి బోగుల వాల్లన్ని చేస్తూ లోపల  నవ్వుకుంటున్న ప్రాపగాండా మేకానిజం ని నిలదీసే సమయం వచ్చింది.

స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...