8, ఏప్రిల్ 2021, గురువారం

70 వ దశకం నుండి 1983 వరకూ తెలుగు మీడియా - రాజకీయ ప్రభావం - కారణాలు, నిజాలు

 పచ్చ మీడియా అనే ఒక పదం ఈ మధ్య ఒక రెండు దశాబ్దాల కాలం లో తెలుగు రాష్ట్రాల్లో  వాడబడుతున్న ఒక పదం. దీని పూర్వాపరాల లోకి వెళ్లి చూస్తే..అసలు ఆంగ్లం  లో ఈ పదాన్ని ఎవరికోసం ఉద్దేశించి కనిపెట్టారో వాళ్ళే దీన్ని వాడటం ఇక్కడ మహా వెటకారం.

చంద్రబాబు గారు  గోబెల్స్ అని, పచ్చ మీడియా ద్వారా రెండు రాష్ట్రాలను కంట్రోల్ చేసేస్తున్నాడు అని మొదలు పెట్టిన్న ఈ ప్రచారం ఇప్పుడు శ్రుతి మించి వెర్రి తలలు వేస్తుంది.నిజానిజాలు చెప్పే ఓపిక తెలిసిన వారికి లేక.. తెల్సుకునే తీరిక  ఇప్పటి జనం కి లేక జనాలు ఈ వారు విసిరినా మూఢత్వం లో కొట్టుకుపోతున్నారు. 

అసలు తెలుగుదేశం పుట్టే నాటికి వున్న ప్రధాన పత్రికలు తీసుకుంటే ఈనాడు, ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి, విశాలాంధ్ర, ప్రజా శక్తి ప్రధాన మైన్ స్ట్రీమ్ పత్రికలు.  పైన చెప్పిన దిన పత్రికల్లో అప్పటికే ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి కాంగ్రెస్ ఏంపి లవి అందులో ఒకటి తిక్కవరపు చంద్రశేఖర్ రెడ్డి ధీ. ఆంధ్ర ప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ రామనాథ గోయెంక ది. ఆంధ్ర పత్రిక కాశీనాథుని నాగేశ్వరావు గారిది, ఆయన చనిపోయాక ఆయన అల్లుడు, కాంగ్రెస్ ఎంపీ  శివలెంక శంబు ప్రసాద్ ఆయన తర్వాత ఆయన వారసులు నడిపారు. సో ..అరవై లకే అప్పటి హై యస్ట్ సర్క్యులేట్ డ్ ఆంధ్ర పత్రిక కాంగ్రెస్ వారిది. ఈ ప్రధాన పత్రికలు కాక ఇంకో డజన్ చిన్న చితక దిన పత్రికలు గా చెప్ప బడేవి వుండేవి

సితార, జ్యోతి చిత్ర ప్రధాన సినిమా పత్రికలు. సితార ఈనాడు ది అయితే, జ్యోతి చిత్ర ఆంధ్ర జ్యోతి ది. జ్యోతి చిత్ర టాప్ సినిమా పత్రిక. ఆంధ్ర జ్యోతి కి బాల జ్యోతి అనే పిల్లల పత్రిక కూడా వుండేది. బాగా నడిచేది. ఇవి కాక వీక్లీ ల హవా నడుస్తున్న ఆ కాలం లో  ఆంధ్ర జ్యోతి, ప్రభ, పత్రిక, భూమి కి వీక్లీ మాగజిన్ లు అదనం గా వుండేవి. 

ఈనాడు వచ్చేనాటికి ఆంధ్ర ప్రభ ఎంట్రీ తో మద్రాస్ ప్రధాన కేంద్రం గా పబ్లిష్ అయే ఆంధ్ర పత్రిక దాదాపు కనుమరుగు అయ్యే పరిస్థితి . అప్పటికే కాంగ్రెస్ భజన పత్రికలను జనాలు ఆదరించడం తగ్గిపోయింది అనే దానికి ఆంధ్ర ప్రభ లభించిన ఆదరణే సాక్షం. తర్వాత  ఈనాడు ఎంట్రీ తో అప్పటి వరకు మూస లో సాగుతున్న దిన పత్రిక పద్దత్తు ల్లో పెను మార్పులు రావడం వల్ల ప్రజలు విపరీతం గా ఆదరించారు. 1974 కి 20 వేల ముద్రణ కెపాసిటీ తో మొదలు అయ్యిన ఈనాడు ప్రస్థానం 1979 కి ఒక లక్షా ఏనబై  వేల కి చేరింది. తెలంగాణ ఉద్యమం , విశాఖ ఉక్కు, జై ఆంధ్ర ఉద్యమాలు, ఎమర్జెన్సీ అనంతరం ప్రజల్లో పెరిగిన రాజకీయ చైతన్యం కూడా తెలుగునాట పత్రికా  పఠనం పట్ల జనం లో ఆసక్తి ని పెంచటం లో దోహద పడింది.  ఆంధ్ర ప్రదేశ్ లో అక్షరాస్యత శాతం లో పెరుగుదల కేవలం 6 శాతం మాత్రమే నమోదు అయ్యిన ఈ కాలం లో దిన పత్రికల పాఠకుల సంఖ్య 70 శాతం పెరిగింది. సింపుల్ గా చెప్పాలి అంటే, రొటీన్ రొట్ట కొట్టుడు తరహా నుంచి నవలా ప్రపంచం లో  ఒక యండమూరి కలిగించిన విముక్తి లాంటి దే ఈనాడు క్రియేట్ చేసింది కూడా. 

ఇలాంటి సమయంలో ప్రతి ఐదు ఏళ్ళకి సర్క్యులేషన్ రెట్టింపు అవుతూ, వ్యాపార సామ్రాజ్యానికి పునాది వేసుకుంటున్న ఏ ఒత్సాహిక వ్యాపార వేత్త కూడా కుల పిచ్చి తో నో మరొక పిచ్చి తో నో అప్పుడే పుట్టిన తెలుగుదేశం కి అండ గా నిలబడే వెర్రి సాహసం చేయడు. పైగా కేంద్రం లో కక్షపూరిత మనస్త్వత్వం గల  ఇందిర గాంధీ  సంగతి, కాంగ్రెస్ సంగతి తెలిసి కూడా. కానీ రామోజీ కాంగ్రెస్ వ్యతిరేక స్టాండ్  తీసుకున్నాడు అంటే జనం లో వున్న కాంగ్రెస్ వ్యతిరేకత కు భిన్నంగా వెళ్లి  వ్యక్తిగత ఇమేజ్ క్రెడి బిలిటీ దెబ్బ  తీసుకుంటే  వ్యాపారం కూడా దెబ్బ అవుతుంది అని లెక్క వుంది కాబట్టే రామోజీ అప్పటి ప్రజా నిర్ణయం బట్టి కాంగ్రెస్ ని వ్యతిరేకించాడు అనేది స్పష్టం. (తర్వాత కాలం లో కూడా జనం లో ఆదరణ వస్తుంది అనుకున్న ప్రతి సారి NTR గారి మీద కూడా  ఏడా పెడ కార్టూన్ లు కామెడీ లు వదిలిన చరిత్ర ఈనాడు కి వుంది, ఆ విషయం ముందు ముందు మాట్లాడుకుందాం) 

1983 చివరికి వచ్చేసరికి ఈనాడు పాఠకులు రెట్టింపు అయ్యారు , 1979 లో లక్షా ఏనాబై వేలు నుంచి 3 లక్షల 47 వెలు అయ్యింది. అలాగే మిగతా కొన్ని పత్రికలు కూడా కాంగ్రెస్ ఎంపి కేఎల్ ఏన్ ప్రసాద్ గారి ఆంధ్ర జ్యోతి సర్క్యులేషన్ 25 వేల నుండి 67 వెలు కి పెరిగింది 1983 కి . తిక్కవరపు చంద్ర శేఖర్ రెడ్డి నడిపే   ఆంధ్ర భూమి లాంటి పరమ కాంగ్రెస్ భక్తి పత్రిక ల ను మాత్రం ఎంతో అభిమానం ప్రేమ తో గజ్జెల మల్లారెడ్డి లాంటి వాళ్ళు వెళ్లి మరీ కృషి చేసినా  కూడా సర్క్యులేషన్ డ్రాప్ ని ఆపలేక పోయారు. 

ఇవి కాక ఇహ మిగిలింది విశాలాంధ్ర, ప్రజాశక్తి..ఇవి రెండు తెలుగు దేశం పార్టీ తో 1983 ఎలక్షన్ ల లో ప్రత్యర్థులు గా పోటీ చేసిన కమ్యునిస్ట్ పార్టీ లవి. సో.. తెలుగుదేశం కి అవి సపోర్ట్ చేసే పరిస్తితి లేదు. అలా అడ్డం గా ఒక పార్టీ ని సపోర్ట్ చేసినా వ్యతిరేకించినా ఆ పత్రికలు పెద్దగా నిలబడని కాలం అది. ఏక పక్షంగా కాంగ్రెస్ వ్యతిరేక ధోరణి తో పోయిన గోయెంక ఆంధ్ర ప్రభ ని కూడా జనం ఆదరించడం మానేస్తున్న ఆ టైమ్ లో..కొంత వరకూ న్యూట్రల్ గా ఉండటానికి ప్రయత్నం చేసిన ఆంధ్ర జ్యోతి కి కాంగ్రెస్ ఎంపి పత్రిక అయ్యినా ఆదరణ లభించింది.( ఆ తర్వాత కాలం లో ఆ ధోరణి కి దూరం జరిగాక ఆంధ్ర జ్యోతి కనుమరుగు అయ్యింది).

ఇప్పుడు ఇక్కడ చూస్తే 1982-83 తెలుగు దేశ ప్రభంజనం లో తెలుగుదేశం కి పరోక్షం గా సహకరించింది ఒక పత్రిక అనుకుంటే..కాంగ్రెస్ కి డైరెక్ట్ గా సహకారం అందించినవి ఎన్నో చూస్తే వాస్తవం అర్దం అవుతుంది. 

 ఆ రోజుల్లో డైరెక్ట్ గా కాంగ్రెస్ ఏంపి లు నడుపుతున్న పత్రికలు, ఇన్ డైరెక్ట్ గా ఆ పత్రిక లను అడ్డు పెట్టుకొని చిన్నా చితకా ముద్రాలయలను, జర్నలిస్ట్ లను రచయతలను ఎలా లోబర్చుకొని రాశారో,రాయించారో కొంచం వెనక్కి వెళ్లి చూడక్క ర్లేదు..ఇప్పుడు నడుస్తున్న చరిత్ర సాక్షి గా చూస్తే అర్ధం అవుతుంది. 

ఇక్కడ పచ్చ పత్రిక"లు" అనడానికి, "లు* కూడా లేవు,కాస్తో కూస్తో అండగా వున్నది ఒకటే పత్రిక, అలా వుండటానికి  దాని కారణాలు దానికి వున్నాయి.  అవి వదిలి పచ్చ పత్రికలు పచ్చ పత్రికలు అంటూ పదే పదే పాడి జనం నీ   వెర్రి బోగుల వాల్లన్ని చేస్తూ లోపల  నవ్వుకుంటున్న ప్రాపగాండా మేకానిజం ని నిలదీసే సమయం వచ్చింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...