మహమ్మదీయ ముష్కరుల కుట్ర ల ఫలితంగా చేజారిన గండికోట ని విడిచి యువరాజు ని వెంటబెట్టుకొని పెమ్మసాని వారి బంధువర్గం లో ఉన్న సాయపనేని, రావెళ్ల, ఘట్టమనేని,మిక్కిలినేని, నారా మున్నగు 66 ఇంటిపేర్లు గల కమ్మవీరులు నలుదిశలా వలస పోయారు.కొందరు నెల్లూరు, చిత్తూరు, అప్పటి గుంటూరు సీమలని చేరగా మరికొందరు పెమ్మసాని వంశం లో మిగిలిన యువరాజుని తీస్కొని మరింత దక్షిణాదికి వలస పోయి వారి బంధువులు అగు మధురై పాలకులు అయినా నాయకర్ల ని ఆశ్రయించగా మధురై విశ్వనాధ నాయకుడు తన రాజ్యం లో ఉన్న కురువికులం, నాయకర్ పట్టి మొదలగు సంస్థానాలని పెమ్మసాని వారికి, ఇలాయరసంధవెల్ అనే సంస్థానం ని రావెళ్ల వారికి కట్టబెట్టాడు.
ఆలా 1652 -1948 వరకు పెమ్మసాని వారు కురివికులం జమీందారు లు ఏలుబడి ని కొనసాగించారు. స్వతంత్ర భారతం లో సంస్థానాల రద్దు తో అది కూడా చేజారిపోయింది. ఆ కురివికులం సంస్థానం చివరి పాలకుడు పెమ్మసాని కొండల రామస్వామి నాయుడు గారు ఉన్నత విద్యావంతుడు. ఆ రోజుల్లోనే ఇంగ్లాండ్ వెళ్లి బారెట్ లా చదివి వచ్చారు. 1914 లో కపిలేశ్వరపురం లో జరిగిన రెండవ కమ్మ మహాజన సభ కి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు.
రామస్వామి నాయుడి గారికి మగ సంతానం లేదు ఒక్కరే ఆడకూతురు. ఆవిడ ని కృష్ణ జిల్లా రంగాపురం జమిందార్ లు అగు అడుసుమిల్లి కుటుంబానికి కోడలి గా పంపారు. అంతటితో రాజవంశం అంతరించినట్లయింది. పెమ్మసాని-అడుసుమిల్లి వారి మనవరాలు గా ప్రముఖ సినీ నటుడు మురళి మోహన్ గారి కుమారుడు రామ్ ని వివాహం చేసుకొన్నా "మాగంటి రూప" ఈ వంశం లో నాయనమ్మ పుట్టింటి తరపున మిగిలిన చివరి వారసురాలు.
పెమ్మసాని బంధుగణం లో పేరెన్నికగన్నవారిలో మరో ప్రముఖులు చిత్తూరు జిల్లా కే చెందిన హై కోర్ట్ మాజీ న్యాయమూర్తి పెమ్మసాని శంకర నారాయణ ఒకరు. అలాగే గండికోట పతనంతరం కోట వదిలి గుంటూరు సీమలోని బుర్రిపాలెం కి వలస వచ్చి రెండు కుటుంబాల్లో ఒకటి పెమ్మసాని సాంభశివరావు ధీ కాగా మరొకటి ప్రముఖ సినీ నటులు సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి ధీ మరో కుటుంభం.
నవ్యాoధ్ర రాజధాని గా తెర మీద కి అమరావతి శంఖుస్థాపన సందర్భoగ పెమ్మసాని రాజవంశీయులు అయినా నెల్లూరు జిల్లాకి చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు గారు బుర్రిపాలెం పెమ్మసాని వారి తో కలిసి గండికోట రాజశిల ని బహుకరించిండం కొసమెరుపు.
సామాన్య గృహస్థులు గా మొదలెట్టి దాదాపు ఐదు వందల ఏళ్ళు గండికోట, యాడికి, గుత్తి, కురువికులం మొదలగు సీమలని, సంస్థానాలని పరిపాలించి చివరికి స్వాతంత్ర భారతం లో మల్లి సామాన్య గృహస్థులు గా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూర్ జిలాల్లో మిగిలిపోయిన పెమ్మసాని రాజవంశీయుల చరిత్ర ఇది.
ఈ వివరాలని టీవీ 9 వారు చేసిన "మనకి తెలియని మన చరిత్ర" అనే ప్రోగ్రాం లో నాటి గండికోట నుండి కురువికులం దాక పెమ్మసాని తెలుగు వంశీయుల చరిత్ర ని పొందుపరిచినా ప్రోగ్రాం లో చూడవచ్చు. అలాగే కొసరాజు రాఘవయ్య చౌదరి రాసిన "గండికోట యుద్ధం", తవ్వా ఓబుల రెడ్డి రాసిన "గండికోట" చరిత్ర లో మరిన్ని వివరాలు దొరుకుతాయి.