11, నవంబర్ 2020, బుధవారం

గుర్రం జాషువా వర్ధంతి సందర్బంగా నా అక్షర నివాళులు

 ఒకనాడు సాహిత్యం తొంబై శాతం ప్రజల స్థితిగతుల్ని గాలికి వదిలేసి కేవలం పదిశాతం ఉన్న ఉన్నత వర్గాలవారి జీవన విధానాలని సంస్కృతులని ప్రతిబింబిస్తూ వారికి ఊడిగం చేస్తున్నప్పుడు అణచబడ్డ వర్గాల నుండి ఉవ్వెత్తిన ఎగిసిపడి దళితులని కథావస్తువులు గా మలిచి వారి జీవన విధానాలను కావ్యాలు గా పద్యాలూ రాసినా నవయుగ కవి చక్రవర్తి, కవి వైతాళికుడు #గుర్రం_జాషువా.


ఇరవయో శతాబ్దం తెలుగు సాహిత్యం లో విప్లవాత్మక భావాలూ ప్రవేశించిన కాలం. అట్టడుగు వర్గాల ప్రజలు కావ్య వస్తువులయినా సందర్భం. అలాంటి సమయం లో అరిగిపోయిన అక్షరాలకు సానబెట్టి, రంగు వెలిసిన పదాలకి మెరుపులద్ది, పద్య శవాలకు ప్రాణం పోసి, సామాజిక దురన్యాయాలని ఎండగడ్తూ ఖండ కావ్యాల చురకత్తులు ఝుళిపిస్తూ సాహితి కదనరంగాన దూకిన కలం యోధుడు గుర్రం_జాషువా.


అంతవరకు రాజులని సంస్థానాధీశులని ఉన్నత వర్గాల ప్రజల జీవన విధానాలని భోగలాలసతని కవిత్వాలుగా మలిచి ఊడిగం చేస్తూ వెయ్యేళ్ళ తెలుగు సాహితి పదాన్ని నడుపుతూ పబ్బం గడుపుకునే కొందరు కుహనా కవులకి దిమ్మ తిరిగేలా తెలుగునాట దళితులని, అణచబడ్డ వర్గాల వారిని కథానాయకులు గా చిత్రీకరించి రాసిన ఘనత తెలుగునాట ఇద్దరికే దక్కుతుంది ఒకరు గబ్బిలం, పిరదౌసి లాంటి ఆణిముత్యాలకి ప్రాణం పోసిన గుర్రం జాషువా కాగా మరొకరు శంభుకవధ రాసిన కవిరాజు  త్రిపురనేని రామస్వామి చౌదరి.


గుంటూరు జిల్లా వినుకొండ లో 1895 లో ఒక దళిత కుటుంభం లో జన్మించిన గుర్రం జాషువా ఆధునిక కవిత కి ప్రాణం పోసిన ధీరుడు అని చెప్పడం లో అతియోశక్తి కాదు. ఆయన ఆధునిక భావాలని విమర్శించినా కొందరు ఛాందస వాదులని ఉద్దేశించి "గవ్వకు సాటిరాని పలుకాకుల మూకలు నన్నెవ్విధి దూరినా నను వరించిన శారదా లేచిపోవునే" అని అనడం ఆయన ధీరోదాత్తతకి అద్దం పడుతుంది.


ఒక దళితుడిని కథానాయకుడి గా మలిచి రాసిన "గబ్బిలం" కావ్యం లో అణచబడ్డ అట్టడుగు వర్గాల ప్రజల స్థితిగతుల్ని వర్ణిస్తూ "ముప్పది మూడు కోట్ల దేవతలెగబడ్డ భరతమేదినిలో భాగ్యవిహీనుల ఆర్తనాదాలు ఎవరికీ వినిపిస్తాయి ..! అణగారిన జాతిజనుల ఈతి బాధలు తీర్చు దేవుడెవ్వడు? " అంటూ రాసిన పదాలు మనల్ని ఆలోచింపచేస్తాయి.


వర్ణ వివక్షత ని ఎత్తి చూపుతూ 

"కులములేని నేను కొడుకుల బుట్టించి 

యీ యఖాతమందే త్రోయవలెనే

భార్యయేలా బుట్టుబానిసకని వాడు

జరుపసాగె బ్రహ్మచర్య దీక్ష  "  రాసిన ఈ పద్యం మరో  ఆణిముత్యం 


అలాంటి కవి కోకిల 1971 జులై 24 నా స్వర్గస్థులయ్యారు. వారి "కొత్తలోకం" లో కవుల గురించి వర్ణిస్తూ


"రాజు మరణించే నొక తార రాలిపోయే

కవియు మరణించే నొక తార గగన మెక్కె

రాజు జీవించె రాతి విగ్రహములందు

సుకవి జీవించె ప్రజల నాలుకల యందు"


ఆయన రాసిన పదాలని అక్షరాలా నిరూపించి ప్రజల నాల్కులయందు మరణం అనేది లేకుండా జీవిస్తున్న సుకవి, నవయుగ చక్రవర్తి, #విశ్వనరుడి వర్ధంతి సందర్బంగా నా ఈ అక్షర నివాళులు(సశేషం).


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...