వర్ణధర్మాలన్న ఉక్కు చట్రముపగిలి
మాలకన్నమదాసు మనసైన సుతుడుగా
వీరవైష్ణవమొచ్చెనూ... పలనాట
బ్రహ్మన్న కలిగీతలో
పలనాడు వెలలేని మాగాణి రా...(కామ్రేడ్ పులుపుల వెంకట శివయ్య )
తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-
సంకోచ పడియెదవు సంగతేంటిరా ?
అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదoచు-
సకిలించు ఆంధ్రుడా ! చావవేటికిరా .(మహా కవి కాళోజి)
ఇల్లు వాకిలి రొసె
ఇల్లాలు తెగ రొసె
ఈ తీరుగా ఉందిరా కొడకా
పట్టె మంచెం రొసె
పడక దిండు రొసె
పంచ పాలయితిరా కొడకా
నేను పంచ పాలయితిరా కొడకా...!
"ప్రతిమల పెండ్లి సేయుటకు వందల వేలు వ్యయించుఁగాని ధుః
ఖితమతులైన పేదల పకీరులా శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్ప ధీ భరతమేదిని ముప్పదిమూడుకోట్ల దే
వత లెగబడ్డ దేశమున భాగ్య విహీనుల క్షుత్తు లాఱునా ..! "(కవి చక్రవర్తి గుర్రం జాషువా)
జాతస్యమరణంధ్రువం అన్నారు
పుట్టిన ప్రతి మనిషి గిట్టిపోవాల్సిందే
మనిషి రేపటి గురించి ఎదురు చూస్తుంటే స్మశానం మనిషి గురించి ఎదురు చూస్తుంటుంది
చావు రానిదెవ్వరికి లేనిదెవరికి
మహారాజులైనా మహారాణులైన మానవుడి ఆఖరి మజిలీ అదే ..!
మహాకవి జాషువా గారు ఏమన్నారో తెలుసా
"ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని
కలము,నిప్పులలోన గరిగిపోయే..
యిచ్చోటనే భూములేలు రాజన్యుని
యధికారముద్రికలంతరించె!
యిచ్చోటనే లేత ఇల్లాల నల్లసౌరు
గంగలోన గలిసిపోయే...
"యిచ్చోటనే వెట్టి పేరెన్నికం గనుగొన్న
చిత్రలేఖుని కుంచియ నశించిపోయే!"
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి