20, జనవరి 2021, బుధవారం

కాంగ్రెస్ పార్టీ చరిత్ర - YSR పార్టీ ఫిరాయింపు కథ


భారత దేశం కి బ్రిటీష్ పాలన నుండి స్వాతంత్రం వచ్చి 1950 లొ భారత రాజ్యాంగం అమలు లొకి వచ్చింది. ఆ ఏడాదే జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఏర్పడింది. స్వతంత్ర భారతావనిలో మొట్టమొదటి ఎన్నికలు 1951 అక్టోబర్ నుండి 1952 ఫిబ్రవరి వరకు జరిగాయి.

జవహర్ లాల్ నెహ్రు సారధ్యనా కాంగ్రెస్ పార్టీ కి ఎన్నికల కమిసన్ "కాడెద్దుల" గుర్తు కేటాయించింది.  ఈ ఎన్నికల గుర్తు తొ మొట్టమొదట కాంగ్రెస్ పార్టి ఎన్నికలకి వెళ్ళి విజయం సాదించింది. 1951 నుండి  1971 వరకు వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్ కాడెద్దుల గుర్తు మీద పోటీ చేసింది. 


1966 జనవరి లొ ప్రధాన మంత్రిగా ఉన్న లాల్ బహ్దూర్ శాస్త్రి గారి మరణం తొ గుల్జారిలాల్ నందా గారిని తాత్కాలిక ప్రధానమంత్రిగా చెసి 13 రొజులకి పార్టి నాయకుని ఎన్నుకునే సమయం లొ ఇందిరా గాంధి గారికి మొరార్జి దేశాయి రూపం లొ గట్టి  పొటి ఏదురైంది.

 కానీ మొరార్జీ దేశాయ్ గారి కోరిక మేరకు జరిగిన సీక్రెట్ ఓటింగ్ లో  నెహ్రూ హయాము తరువాత సిండికేట్ గా పేరు గాంచిన కామ్రాజ్ నాడర్, నిజ లింగప్ప, నీలం సంజీవ రెడ్డి  లాంటి కొంతమంది వ్యక్తుల సహాయము తొ   ఇందిరా  గాంది విజయం సాదించారు. 1966 జనవరి 19న జరిగిన ఆ ఎన్నికలొ మొరార్జీ కి 169 ఒట్లు , ఇందిరా గాంధి కి 355 రాగా ఇందిరా మొరార్జి మీద 186 ఒట్ల తేడా తొ గెలిచి ప్రధానమంత్రి అయ్యారు.

ఈ సిండికేట్ పేరుతొ కాంగ్రెస్ లొ కొంతమంది కుర్చి లొ ఎవరు కూర్చున్న వారు ఆ కుర్చీని నడిపేవారి గా తయ్యారు అయ్యారు. ఇందిరా వారు ప్రధాని గా కుర్చోపెట్టడానికి కారణం కూడా ఇదే ఆవిడా వెనకాల ఒక అదృశ్య శక్తీ లా రాజకీయాలు ప్రభావితం చెయ్యాలనే దురాలోచనే. ఇందిరా ప్రధాని గా ఎన్నికయ్యాక కొన్ని నెలల కె  తన స్వంత నిర్ణయాలు తో సిండికేట్ ఆలోచనల ని తలకిందులు చేసారు. దానితో ఇందిరా గాంధీ కి సిండికేట్ కి క్రమంగా విబేధాలు పొడచూపాయి. 


1969 నాటికి అవి తారాస్థాయికి చేరాయి.అదే ఏడాది 14 బ్యాంకు లని ఇందిరా గాంధీ జాతీయం చేసారు. ఈ నిర్ణయం తో ప్రజల్లో హర్షాతిరేకాలు కల్గిన సిండికేట్ లో ఒకరైన మొరార్జీ గారికి ఈ నిర్ణయం మింగుడు పడలేదు. వెంటనే తన ఆర్థిక మంత్రి పదవి కి రాజీనామా చేసారు. 

ఇలా జరుగుతున్న సమయం లొ రాష్ట్రపతి గా ఉన్న జాకీర్ హుస్సేన్ మరణం తొ రాష్ట్రపతి ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఈ  రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా నీలం సంజీవ్ రెడ్డి ని పోటీ కి నిలిపారు. ఇందిరా గాంధీ సంజీవ రెడ్డి కి వ్యతిరేకంగా అప్పటి ఉప రాష్ట్రపతి వి వి గిరి అనే మరో తెలుగు వాడిని  ఇండిపెండెంట్ రాష్ట్రపతి అభ్యర్థి గా పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ప్రధాని  ఇందిరా అంతరాత్మ ప్రభోదానుసారంగా  గా ఓటు వేయమని తమ నాయకులకి  పిలుపునిచ్చారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థి అయిన సంజీవరెడ్డి ని కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి అయిన వివి గిరి second preference votes తో అతి తక్కువ మెజారిటీ తో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించారు. దీనితో సిండికేట్ కి ఇందిరా కి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరాయి. అప్పటి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గా నిజ లింగప్ప ఉండేవారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన సంజీవరెడ్డి ఓడిపోయినందుకు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేసారు అనే సాకు తో  ప్రధాని గా ఉన్న  ఇందిరా ను నిజలింగప్ప పార్టీ నుంచి బహిష్కరించారు.


ఈ బహిష్కరణ తో కాంగ్రెస్ రెండు ముక్కలు అయింది. కామరాజ్, మొరార్జీ దేశాయ్ లాంటి సిండికేట్ల  అద్వర్యం లొ తమదే నిజమైన కాంగ్రెస్ అని, ఆ కాంగ్రెస్ కి ( కాంగ్రెస్ ఒ ) (కాంగ్రెస్ ఆర్గనైజేషన్) గా పిలుచుకున్నారు, బహిష్కరంప బడిన ఇందిరా తమ వర్గం తొ (కాంగ్రెస్ ఆర్) (కాంగ్రెస్ రెక్వజెషన్) గా పిలుచుకున్నారు 1971 ఎన్నికలలొ(కాంగ్రెస్ ఒ) తమ పాత కాంగ్రెస్ ఎన్నికల గుర్తు అయిన "కాడెద్దులు" గుర్తు  తొ రాగా , (కాంగ్రెస్ ఆర్) కి ఎన్నికల సంఘం "ఆవు దూడా" గుర్తు ఇచ్చింది.


"ఆవు దూడా" ఎన్నికల గుర్తు తొ ఏ పొత్తులు లేకుండా 1971 ఎన్నికలకి వెళ్ళగా , (కాంగ్రెస్ ఒ) మాత్రం భారతీయ జనసంఘ్ , స్వతంత్రపార్టి, సమ్యుక్త సొషలిస్ట్ పార్టి, ప్రజా సొషలిస్ట్ పార్టిలతొ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళింది , ఈ ఎన్నికలలొ కాంగ్రెస్ ఒ చిత్తుగా ఒడిపొయి కెవలం 518 సీట్లకి 16 సీట్లు మాత్రమే గెలుచుకుంటే , ఇందిరా గాంధి "కాంగ్రెస్ (ఆర్)" పార్టి మాత్రం గరీభి హటావొ ( పేదరిక నిర్మూలన ) నినాదం తొ ప్రజలలొకి వెళ్ళి వారి మనస్సు గెలుచుకుని 352 సీట్లు గెలుచుకుని ప్రభుత్వం ని ఏర్పారు చెసింది. ఈ గెలుపుతొ ఎన్నికల సంఘం ఇందిరా గాంధి గారి కాంగ్రెస్ పార్టి ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా గుర్తించింది. కొత్త కాంగ్రెస్ కి అద్యక్షులు గా జగ్ జీవన్ రాం ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 

ఆ ఎన్నికల్లో విజయం సాదించినా ఇందిరా 1971 లో జరిగిన పాకిస్థాన్ తో యుద్ధం బంగ్లాదేశ్ ఏర్పాటు లాంటి వాటిని ఆవిడ కీర్తి అమాంతం పెరిగింది. కానీ రాయ్ బరేలి నుండి ఆవిడ మీద లోక్సభ ఎన్నికల్లో  పోటీ చేసి ఓడినా గురు రాజ్ నారాయణ్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి కోర్ట్ కి వెళ్లారు. నాలుగేళ్లు నడిచిన ఈ కేసు లో ఇందిర గాంధీ మీద మోపిన అభియోగాలు నిజమని తేలడం తో అలహాబాద్ కోర్ట్ 1975 నా ఆవిడ ఎన్నిక చెల్లదని అలాగే ఆవిడ మరో ఆరేళ్ళ  పాటు టు పోటీ చేసే అర్హత లేదని తీర్పు ఇచ్చింది. 

వెంటనే ఇందిరా గాంధీ కొడుకు సంజయ్ గాంధీ మరి కొందరు కాంగ్రెస్ నాయకుల సలహా మేరకు 1975 జూన్ 15 నా ఎమర్జెన్సీ విధించారు. ఈ ఎమర్జెన్సీ దాదాపు రెండేళ్లు నడిచి 1977 నా ముగిసింది. ఈ ఎమర్జెన్సీ ప్రభావం తో ఇందిరా ప్రభ కి మసకబారింది. ప్రజల్లో కోపావేశాలు పెల్లుబికాయి. 

దానిఫలితమే ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి ఘోర పరాజయం ఎదురైంది. ఇందిరా  స్వయంగా  పోటీ  చేసినా  ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి  ఓడిపోయారు.ఆవిడా కుమారుడు సంజయ్ గాంధీ కూడా పరాజయం చవి చూసారు. 1977ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేశమంతా ఎదురుగాలి వీచిన ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు మాత్రం  పట్టంగట్టారు. 42 పార్లమెంట్ స్థానాలకు గాను 41 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఒక్క నంద్యాలలో మాత్రం ఆ పార్టీకి ఓటమి ఎదురైంది. ఇక్కడి నుంచి జనతా పార్టీ తరఫున పోటీ చేసిన నీలం సంజీవరెడ్డి గెలిచారు. 

1977 మే 6 నా  లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి ఇందిరా అనూయుడు, ఎమర్జెన్సి పెట్టమని సలహా ఇచ్చిన సిద్దార్ధ శంకర్ రాయ్ మీద గెలిచి  పార్టీకి అధ్యక్షుడయ్యారు. ఇండియా అంటే ఇందిరా అన్న కాంగ్రేసు నేతలే ఓటమి తరువాత ఇందిరాను అనేక విధాలుగా అవమానించారు.

 ఎమర్జెన్సి సమయంలో వివిద కంపెనీలకు చెందిన 104 జీపులను అక్రమంగా వాడుకున్నారన్న అభియోగంపై 1977 మే నెలలో CBI ఇందిరాను అరెస్టు చేసింది. ఈ అరెస్టుతో ఎమర్జెన్సి సమయంలో జరిగిన అణిచివేత,దౌర్జన్యాల వలన ఇందిరా మీద ప్రజల్లొ ఏర్పడ్డ వ్యతిరేకత,కోపం తగ్గిపోయి ఇందిరా మీద ప్రజల్లొ సానుభూతి పెల్లుబికింది.

ఇందిరా కాంగ్రెస్  మీద పట్టు కోసం చేసిన ప్రయత్నాలు సఫలంకాకపోవటంతో బెదిరింపు ధోరణిలో 1977 డిసెంబర్ 18న ఇందిరా & ఆమె వర్గం కాంగ్రేస్ కార్యవర్గానికి రాజినామ చేశారు. బ్రహ్మానందరెడ్డి వర్గం పట్టించుకోకపోవటంతో 1978 జనవరి మొదటి వారం లో  ఇందిరా వర్గం సమావేశం నిర్వహించి ఇందిరాను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.అదే వారం లో అప్పటి AICC ప్రెసిడెంట్  బ్రహ్మానందరెడ్డి ఇందిరాను,ఆమె వర్గాన్ని పార్టి నుంచి బహిష్కరించారు

1978లో కాంగ్రెస్ మరోసారి  రెండుగా చీలింది. ఇందిరా జనవరి 10-12 మధ్య సొంత పార్టి కాంగ్రేస్(I) స్థాపించారు. కాంగ్రేసు ఎన్నికల గుర్తు ఆవు-దూడ బ్రహ్మానందరెడ్డి వర్గానికి ఎన్నికల కమీషన్ కేటాయించింది.ఈనిర్ణయాన్ని సవాలు చేస్తు ఇందిరా సుప్రిం కోర్టుకు వెళ్ళగా ఎన్నికల కమీషన్ విధుల్లొ కల్పించుకోమని ప్రకటించి కోర్టు కేసు కొట్టేసింది.

మరో వైపు ఎన్నికల కమీషన్ 1978 జనవరి 13న ఆంద్రప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర, కర్నాటక, మేఘాలయ,అరుణాచల్ ప్రదేశ్ 6 రాష్ట్రాలకి ఫిబ్రవరి 24న ఎన్నికలు జరుగుతాయి అని నొటిఫికేషన్ విడుదల చెసింది. 

దీంతొ  తమ పార్టి ని కాంగ్రెస్ (ఐ) గా వ్యవహరించాలి అని నిర్నయం తీసుకున్నారు, రాన్నున్న ఎన్నికలలొ గుర్తు కొసం తీవ్ర ఆలొచన చెసిన ఇందిర వర్గం, హస్తం గుర్తు కేటాయించాలి అని ఎన్నికల కమీషన్ ని అభ్యర్ధించగా ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ ఐ ( ఇందిరా కాంగ్రెస్ కి ) "హస్తం" గుర్తు కేటాయిస్తు 1978 ఫిబ్రవరి 2వ తారికున ప్రకటించారు.


ఇంకా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకి వస్తే బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ (కాంగ్రెస్ ఆర్) లో పెద్ద నాయకులూ గా మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు,NG రంగా, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, బొడ్డేపల్లి రాజగోపాలరావు,బత్తిన సుబ్బారావ్ ,మండలి కృష్ణారావు, పిన్నమనేని కోటేశ్వర రావు ,రోశయ్య లాంటి పెద్ద స్థాయి నేతలు, మంత్రులు గా చేసిన వారు ఉండిపోయారు. 

జనతా పార్టీ తరపున గెల్చినా ఏకైక నేత నీలం సంజీవ రెడ్డి తో పాటు గా  తెన్నేటి విశ్వనాధం ,గౌతు లచ్చన్న , బాబుల్ రెడ్డి , పిడతల రంగారెడ్డి,ఆనం కుటుంబం,రెడ్డివారి రాజ గోపాల్రెడ్డి, జైపాల్ రెడ్డి, P.రామచంద్రారెడ్డి,జవ్వాది చొక్కా రావ్ లాంటి నాయకులూ చేరారు. 

ఇందిరా కాంగ్రెస్ (కాంగ్రెస్ ఐ)  తరుపున  T.అంజయ్య,జి రాజారామ్ ,బాగారెడ్డి,పాగా పుల్లారెడ్డి లాంటి వారు తెలంగాణాలోను  చింతలపాటి  మూర్తిరాజు, వైరిచెర్ల చంద్ర చూడామణి,వాసిరెడ్డి కృష్ణ మూర్తినాయుడు, ఆళ్వార్ దాస్,కోనా ప్రభాకర రావ్,కొనేరు రంగా రావ్,కాకాని వెంకట రత్నం కుటుంబం,దివి కొండయ్య చౌదరి, కందుల ఓబుల్ రెడ్డి,నల్లారి అమర్నాథ్ రెడ్డి ,పెళ్ళకూరు రామచంద్రారెడ్డి, K.E. మాదన్న,పాటూరి రాజగోపాల్ నాయుడు  లాంటి వారు కోస్తా, రాయలసీమలో ఇందిరా కాంగ్రేసు తరుపున నిలిచారు.

ఇందిరా కాంగ్రేసుకు చుక్కాని లేదు.ఈపరిస్థితులో ఉత్తరప్రదేశ్ గవర్నరుగా ఉన్న మర్రి చెన్నారెడ్డి రాజినామా చేసి 18-Jan-1978న ఇందిరా కాంగ్రేసు ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవి స్వీకరించారు. MPగా ఉన్న P.V.నరసింహారావ్ డిల్లీలో ఇందిరాకు సహాయంగా ఉన్నారు.

పార్టీ పెట్టిన నెల రోజులల్లో ఎన్నికలు రావడం తో  ఇందిర కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అయింది. పార్టీ గుర్తు కూడా కొత్తది అవడం పార్టీ తరపున నేతలు బలమైన నేతలు కూడా పెద్ద గా లేకపోవడం లాంటివి సమస్యలు గా మారాయి. ఇందిరా కాంగ్రేసుకు అభ్యర్ధులు దొరకని పరిస్థితి.ఎన్నికల డిపాజిట్ 500 రూపాయలు కట్టగలిగే చదువుకున్న యువకులకు పెద్దేత్తున టికెట్లు ఇచ్చారు. బ్రహ్మానందరెడ్డి కాంగ్రేస్ గెలుస్తుందని అంచనా..

మన రాష్టం లో రెండు కాంగ్రెస్ లు పోటీ లో ఉండటం చేత కాసు బ్రహ్మానంద రెడ్డి అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ ని "రెడ్డి" కాంగ్రెస్ గాను ఇందిరా నేతృత్వాన నడిచే కాంగ్రెస్ ని "ఇందిరా" కాంగ్రెస్ గాను పత్రికలూ సంబోదించాయి. 


ప్రతి కాలేజీ కి ఒక గోల్డెన్ బ్యాచ్ ఉన్నట్లు ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక గోల్డెన్ బ్యాచ్. 1978లో జరిగిన రాజకీయ పరిణామాల్లో భవిషత్తు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు రాజకీయ జీవితం మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుగురు ముఖ్యమంత్రుల రాజకీయ జీవితం 1978లోనే మొదలైంది.

ఈ పోస్ట్ లో వారందరిని కవర్ చేయలేకపోవచ్చు గాని కొందరి పేర్లు  ఉదహరిస్తాను.వారిలో  నారా చంద్రబాబు నాయుడు, YS రాజశేఖర్ రెడ్డి, ముప్పవరపు వెంకయ్య నాయుడు, PJR , KE కృష్ణమూర్తి, కరణం బలరాం లాంటి వారు ప్రముఖులు. 

ఈ ఎన్నికల్లో చంద్రగిరికే చెందిన, ఇందిరా కాంగ్రేస్ నాయకుడు P.రాజగోపాల్ నాయుడు(గల్లా అరుణ తండ్రి) గారు చిత్తూరు MPగా ఉన్నారు. రాజగోపాల్ నాయుడు చదువుకున్న యువకులను పోటికి దించాలని చేసిన అన్వెషణలో చంద్రబాబు దొరికారు.చంద్రబాబు S.V.Universityలో P.G పూర్తిచేసి ఉన్నారు, విధ్యార్ధి రాజకీయాలతో పరిచయం ఉన్నది. చంద్రబాబు ధీ సాధారణ రైతు కుటుంభం. ఈ ఎన్నికల్లో రాజగోపాల్ నాయుడు గారి చంద్రబాబు ని అన్ని రకాలు గా ఆదుకున్నారు. కేవలం రెండు జతల బట్టల తో మిత్రుల తో  నియోజక వర్గం అంత తిరిగి ఓటర్ల మనసు చూరగొని జనతా పార్టీ అభ్యర్థి పట్టాభి రామ్ చౌదరి  మీద నెగ్గారు. 

ఇకబోతే పులివెందుల నుండి YS రాజశేఖర్ రెడ్డి ఈ ఎన్నికల్లో ప్రత్యక్ష  రాజకీయ రంగ ప్రవేశం చేసారు. 1975 లో గుల్బర్గా లో మెడిసిన్ చదువు పూర్తీ చేసి వచ్చిన YSR పులివెందుల లో ప్రాక్టీస్ పెట్టారు. అలాగే యువజన కాంగ్రెస్ లో చేరి రాజకీయాల్లో కూడా తిరుపతి యువజన కాంగ్రెస్ మీటింగ్ లో సంజయ్ గాంధీ ని కలిశారు. 


పులివెందుల మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. ఈ నియోజక వర్గం నుండి మూడు సార్లు  నెగ్గిన పెంచికల బసిరెడ్డి మంత్రి గా కూడా పని చేసారు. అలాగే పులివెందుల గ్రామం మండలం లో DN రెడ్డి ఆధిపత్యం కొనసాగేది. ఈ బసిరెడ్డి తరువాతి పరిస్థితుల్లో జనతా పార్టీ లో చేరడం తో పులివెందుల కాంగ్రెస్ YSR నాయకుడు అయ్యాడు. ఏడాది గా YSR గ్రామాల్లో తిరుగుతూ పరిచయాలు పెంచుకున్నారు. 

కాంగ్రెస్ చీలిపోవడం తో YSR కాసు బ్రహ్మానంద రెడ్డి కాంగ్రెస్  తరుపున నిలబడగా జనతా పార్టీ ఎన్నికల కి ముందు బసి రెడ్డి మరణించడం తో ఆయన స్తానం లో DN రెడ్డి కి టికెట్ ఇచ్చి పోటీ లో నిలిపింది. ఇందిరా కాంగ్రెస్ తరుపున కొత్త అభ్యర్థి బండ్ల సోమి రెడ్డి ని పోటీ లో నిలిపింది.  ఈ ఎన్నికల్లో YSR తన సమీప ప్రత్యర్థి DN రెడ్డి పై విజయం సాధించారు. 


1978 ఎన్నికల్లో  అందరి అంచనాలని తారుమారు చేస్తూ 

ఇందిరా కాంగ్రెస్ 170 

జనతా పార్టీ  57 

రెడ్డి కాంగ్రెస్ AKA కాంగ్రెస్(INC ) 30 స్థానాలు గెలుచుకున్నాయి. ఇందిరా కాంగ్రెస్ తరుపున ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి గా ఉన్న మర్రి చెన్నారెడ్డి CM అయ్యారు. రెడ్డి కాంగ్రెస్ తరుపున గెల్చిన కొందరి లో  చలనం మొదలయ్యింది. ఎన్నికలు గడిచి నాలుగు రోజులైనా గడవక ముందే ఫిరాయింపు లకి తెర లేపారు. 


వారిని ఉద్దేశించి రెడ్డి కాంగ్రెస్ నేత భాట్టం శ్రీరామ్ మూర్తి గారు 1978 అసెంబ్లీ లో  "మధుపర్కాలతో మంగళ సూత్రాలతో పెళ్లిపీటల మీద నుంచి లేచిపోయిన కొత్త పెళ్లి కూతురిలా నీ (మర్రి చెన్నారెడ్డి) వైపు మళ్లారు మా పార్టీ శాసన సభ్యులు ...ఏముంది నీలో ఆకర్షణ?’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.ఆ పార్టీ పిరాయించిన వారిలో  ప్రభావతమ్మ లాంటి మహిళా శాసన సభ్యులు ఉండటం చేత  ఈ వ్యాఖ్యలకి వెంకటగిరి నుండి ఇందిరా కాంగ్రెస్ తరుపున గెల్చిన నల్లపు రెడ్డి శ్రీనివాసులు రెడ్డి తీవ్ర  అభ్యంతరం వ్యక్తం చేసారు. 


ఇందులో కొందరు మేధావులు YSR మీద పశ్చపాత బుద్ధి తో రెడ్డి కాంగ్రెస్ నుండి గెల్చిన ముప్పై మందికి గాను  ఇరవై మంది MLA లు ఒకేసారి ఇందిరా కాంగ్రెస్ లో  చేరారు . 2 /3 మెజారిటీ సభ్యులు చేరారు గనుకా అది విలీనం కిందకి వస్తుంది ఫిరాయింపు కిందకి రాదూ అని ఎదో లాజిక్ లాగారు. నిజానికి Anti-Defection act 1985 లో రాజ్యాంగం లో చేర్చారు. అప్పటికి ఈ ఫిరాయింపు చట్టం లేదు. 

అలాగే రెడ్డి కాంగ్రెస్ నుండి ఇందిరా కాంగ్రెస్ కి మొదట పిరాయించింది కేవలం 15 మంది మాత్రమే అందులో YSR కూడా ఒకరు. 2 /3 అంటే కనీసం ఇరవై మంది సభ్యులు ఉండాలి కానీ  YSR పిరాయించేనాటికి 15 మందే  ఉన్నారు కాబట్టి అది విలీనం కిందకి కూడా  రాదూ. అలాగే ఫిరాయింపు చట్టం కిందకి రాదూ. సరే అప్పుడు ఆ Anti-Defection act లేదు కాబట్టి  దీనిని  ఫిరాయింపు అనొద్దు ,మరి వ్యక్తిగత నైతికత ఉండద్దా?


సరే ఈ Anti-Defection act వచ్చాక మాత్రం YSR చేసింది ఏముంది ? ఇతర పార్టీ గుర్తు లా మీద గెల్చిన MLA లని తనవైపు కు తిప్పుకోలేదా ? MP లని కాంగ్రెస్ వైపు కి  లాగి  సొంత పార్టీ విప్ ని సైతం దిక్కరించేంత స్థాయి కి వారిని YSR దిగజార్చలేదా ? 


నైతిక విలువల గురించి ఒంటి మీద వలువలు ఉన్నాయో లేదో అన్న సోయ లేకుండా  బోసడింగులు చెప్పే YS ఫామిలీ గెల్చిన పార్టీ నుండి నాలుగు రోజుల కె అధికార పార్టీ లోకి ఫిరాయించడం ఏ  విలువల కిందకి వస్తుంది ? (సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

స్థానిక సంస్థలు -స్వయం పరిపాలన

మనది మూడెంచల పంచాయితీ రాజ్ వ్యవస్థ అందులో ముఖ్యమైన గ్రామ పంచాయతీ నిర్మాణం గురించి తెలుసుకుందాం..! పంచాయతీ అంటే ◆ గ్రామ సభ ◆ గ్రామపంచాయతీ వార...